India Corona: భారీగా తగ్గిన కరోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త‌గా 1,86,364 కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉద‌యం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో క‌లిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,75,55,457కి చేరింది. అలాగే కొత్తగా 2,59,459 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 2,48,93,410 మంది కోలుకున్నారు.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 3,660 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు వదిలారు. ఇప్ప‌టి వర‌కు మొత్తం 3,18,895 మంది వైరస్‌ బారినపడి మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 23,43,152 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్రం పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.