USA: మైక్రోసాప్ట్ క్యాంపస్లో భారతీయ యువ సాప్ట్వేర్ మృతి
USA: అమెరికాలో సిలికాన్ వ్యాలీలోని మైక్రోసాప్ట్ క్యాంపస్లో భారతీయ ఇంజినీర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతీక్ పాండే అనే ఇంజినీర్ మైక్రోసాప్ట్ ఫ్యాబ్రిక్ ప్రొడొక్ట్లో 2020 నుండి పనిచేస్తున్నాడు. క్లౌడ్, ఎఐ చీఫ్ స్కాట్కు రిపోర్ట్ చేసేవాడు. ఆగస్టు 19వ తేదీన విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత రోజు తెల్లవారు జామున మృతి చెందాడు. అక్కడ ఎటువంటి అనుమానాస్పద పరిస్తితులు లేకపోవడంతో అనుమానాస్పద మరణంగా పోలీసులు పేర్కొన్నారు. ప్రతీక్ ఆఫీస్లో లేట్నైట్ వరకు పనిచేసేవాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అతని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని మెడికల్ ఎగ్జామినర్ తెలిపారు. అయితే, అతని మరణంపై మాట్లాడేందుకు మైక్రోసాప్ట్ నిరాకరించినట్లు సమాచారం.
NHPC: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో 248 పోస్టులు
[…] USA: మైక్రోసాప్ట్ క్యాంపస్లో భారతీయ… […]