80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
హైదరాబాద్ (CLiC2NEWS): టిఎస్ ఆర్టీసీకి చెందిన 80 కొత్త బస్సు లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. శనివారం హైదరాబాద్లోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్య్రకమం జరిగింది. మంత్రి ప్రారంభించిన బస్సులలో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఎసి, 20 లహరి స్లీపర్, సీటర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు ఆర్టీసీ ఎండి సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ పరిరక్షణకు, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సిసిఎస్ బకాయిలను త్వరగా విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే త్వరలోనే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని సంస్థ ఎండి సజ్జనార్ తెలిపారు.