India Corona: కొత్తగా 42,766 పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 42,766 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ ఆదివారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది.
  • ప్ర‌స్తుతం దేశంలో 4,10,048 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 38,091 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గ‌డా 308 మంది మృత్యువాత‌ప‌డ్డారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 4,40,533 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు.
  • కరోనా రికవరీ రేటు 97.42 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
  • కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని తెలిపింది.
  • రాష్ట్రంలో గత 24 గంటల్లో 29,682 కేసులు నమోదవగా,
    142 మంది మృతిచెందారు.
  • దేశంలో ఇప్పటివరకు 66.89 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది….

  • కొత్త‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా  4,78,615 మందికి కరోనా సోకినట్లు తేలింది.
  • వైరస్​ ధాటికి మరో 7,752 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 221,077,480కు చేరింది.
  • అలాగే మరణాల సంఖ్య 45,74,470కు పెరిగింది.

కొత్త కేసులు ఇలా..

  1. అమెరికా -58,682
  2. బ్రెజిల్​- 21,804
  3. రష్యా- 18,780
  4. బ్రిటన్​- 37,578
  5. ఫ్రాన్స్​- 13,336
  6. టర్కీ-20,033
  7. ఇరాన్​-20,404
  8. మెక్సికో-17,409
Leave A Reply

Your email address will not be published.