మహారాష్ట్రలో ఒక్క రోజే 60 మంది మృతి
ముంబయి: మహారాష్ట్రలో కొత్తగా 2,854 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. శనివారం 1,526 మంది డిశ్చార్జ్ అయ్యారని, మరో 60 మంది చనిపోయారని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,16,236కు చేరింది. ఇప్పటి వరకు 18,07,824 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,091 యాక్టివ్ కేసులున్నాయి.