మహారాష్ట్రలో 3,218 కరోనా కేసులు.. 51 మరణాలు

ముంబయి: మహారాష్ట్రలో శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,218 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,38,854కు, మరణాల సంఖ్య 49,631కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 2,110 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,34,935కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,137 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.