కరోనా వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు పూర్తి: వైద్య మంత్రి ఈటల

హైదరాబాద్: రాష్ట్రంలో 16వ తేదీ నుంచి తొలి విడుత కరోనా వ్యాక్సినేషన్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకాలు పంపిణీ చేసేందుకు 139 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. వీటిలో 99 ప్రభుత్వ దవాఖానలు, 40 ప్రైవేట్ దవాఖానలున్నాయి. రాష్ట్రానికి ఇప్పటివరకు 3.60 లక్షల డోసులు వచ్చాయని ఆయన వెల్లడించారు. మొదటి డోసు తీసుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారని తెలిపారు. ఇదిలాఉండగా తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సిన్ భద్రత కోసం 800 కోల్డ్ చైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోఠి నుంచి వ్యాక్సిన్ను జిల్లా కేంద్రాల్లోని ఇమ్యూనేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.