జైలు నుంచి శశికళ విడుదల
బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి బుధవారం ఉదయం విడుదల అయ్యారు. అవినీతి కేసులో శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించింది. కరోనా బారినపడ్డ శశికళ బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. శశికళ విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఆస్పత్రిలోనే పూర్తి చేశారు. మరో కాగా మరో 10 రోజుల పాటు ఆమె ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. కాగా ఇప్పటికే శశికళ జైలు నుంచి విడుదలయ్యేందుకు ఆమె రూ.10కోట్ల జరిమానా చెల్లించారు. 2017 ఫిబ్రవరిలో అక్రమాస్తుల కేసులో శశికళను అరెస్టు చేశారు.