ఇప్పుడేం చెబుతారు?: మ‌ంత్రి కెటిఆర్ ట్విట్‌

హైదరాబాద్‌: ఇంత‌కు ముందు కేంద్రంలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగితే ప్ర‌స్తుతం ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ మంత్రులు ప‌లువురు విమర్శించారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కెటిఆర్‌‌ గుర్తుచేశారు. గ‌తంలో చ‌మురు ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు విమ‌ర్శించిన మోడీ, స్మృతి ఇరానీ, నిర్మ‌లా సీతారామ‌న్‌ల వీడియోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. అప్ప‌డు పెరిగిన ధ‌ర‌ల‌ను విమ‌ర్శించిన బిజెపి నేత‌లు ఇప్ప‌డు ప్ర‌జ‌ల‌కు ఏమ‌ని స‌మాధానం చెబుతారు? అని కెటిఆర్ ట్విట్ట‌ర్ పోస్టు ద్వారా ప్ర‌శ్నించారు.

Leave A Reply

Your email address will not be published.