భారీగా త‌గ్గిన కరోనా కేసులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్త‌గా 8976 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ఆదివారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1758339 కు పెరిగింది.

గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 90 మంది మృతి చెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 11,466 మంది మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో ఏపీలో 13,568 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. తాజా రిక‌వ‌రీల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 16,09,879 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రం 1,23,426 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.