గులాం నబీ ఆజాద్‌కు కరోనా

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి రోజ‌రోజుకి పెరిగిపోతోంది. ఈ వైర‌స్ దేశంలో కేంద్ర మంత్రులు, ప్రముఖుల నుండి సాధారణ ప్రజల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఇటీవల ప‌లువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప‌లువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు గులాం నబీ ఆజాద్‌కు సైతం కోవిడ్‌-19 సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌ అని తేలిందని, హోం క్వారెంటైన్‌లో ఉంటున్నానని ఆజాద్‌ తెలిపారు. గత కొన్ని రోజుల నుండి తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

 

Leave A Reply

Your email address will not be published.