కడపలోని యోగి వేమన వర్సిటి హాస్టల్లో 30 విద్యార్థులకు అస్వస్థత
కడప (CLiC2NEWS): యోగి వేమన హాస్టల్లో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో యూనివర్సిటి అధికారులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.