ఎపి రాజ‌ధాని కోసం మొద‌టి నెల జీతం విరాళం: మంత్రి రాంప్ర‌సాద్

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం రాష్ట్ర రావాణా, యువ‌జ‌న‌, క్రీడాశాఖ మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి విరాళం అంద‌జేశారు. అమ‌రావ‌తి నిర్మాణానికి త‌న మొద‌టి నెల జీతం రూ. 3,01,116 ను చెక్కు రూపంలో సిఎం చంద్ర బాబు నాయుడుకు అంద‌జేశారు. ఎపి రాజ‌ధాని నిర్మాణానికి ప‌లువురు విరాళాలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మంత్రి త‌న మొద‌టి నెల జీతం విరాళంగా అందించారు.

Leave A Reply

Your email address will not be published.