ఎపిలోని తెలంగాణ ఉద్యోగుల‌ను రిలీవ్ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న‌ తెలంగాణ ఉద్యోగుల‌ను రిలీవ్ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.  తెలంగాణ స్థానిక‌త ఉన్న ఉద్యోగులను 122 మందిని రిలీవ్ చేస్తూ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. వారంద‌రినీ స్వ‌రాస్ట్రానికి పంపాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభ్య‌ర్థ‌న‌పై సానుకూలంగా స్పందించిన ఎపి ప్ర‌భుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. రిలీవ్ అయ్యే వారు త‌మ కేడ‌ర్ చివ‌రి ర్యాంక్‌లోనే విధుల్లో చేర‌నున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.