బేగంపేట: 700 కిలోల కుళ్లిన చికెన్ స్వాధీనం..

బేగంపేట్ (CLiC2NEWS):  నగ‌రంలోని ఓ చికెన్ సెంట‌ర్‌లో ఆహార భ‌ద్ర‌తా టాస్క్‌ఫోర్స్ అధికారులు త‌నిఖీ చేయ‌గా ఏకంగా 700 కిలోల కుళ్లిన చికెన్‌ను గుర్తించారు. ఈ ఘ‌ట‌న సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట ప్ర‌కాశ్‌న‌గ‌ర్ లోని చికిన్ సెంట‌ర్‌లో వెలుగుచూసింది. చికెన్ సెంట‌ర్‌లో  700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన చికెన్‌ను మ‌ద్యం దుకాణాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు గుర్తించారు. కుళ్లిన చికెన్‌, కొవ్వు ప‌దార్థాలు, కోడి ఎముకల‌కు కెమికల్స్ క‌లిపి ఫాస్ట్పుడ్ సెంట‌ర్లు, మ‌ద్యం దుకాణాల‌కు అమ్ముతున్న‌ట్లు స‌మాచారం. అధికారులు చికెన్ సెంట‌ర్‌ను సీజ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.