ఏసీబీకి చిక్కిన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్

మహబూబ్నగర్ : జిల్లాలోని బాలానగర్ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జీ విజయ్ మోహన్ బుధవారం రూ. 5 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలు.. గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జీ విజయ్ మోహన్ అదే కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్న కె. కిరణ్ను రూ. 5 వేలు లంచం డిమాండ్ చేశాడు. ప్రతినెల జీతం డబ్బులు రెగ్యూలర్గా లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. దీంతో కిరణ్ అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వల పన్ని లంచం తీసుకుంటుండగా విజయ్ మోహన్ను పట్టుకున్నారు. కిరణ్కు వ్యతిరేకంగా ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వకుండా ఉండేందుకు లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.