ఎపిలో కొత్తగా 2,237 కరోనా కేసులు, 12 మరణాలు..

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,237 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,42,967కి చేరింది. ఇందులో 21,403 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,14,773 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 12 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,791కు చేరుకుంది. ఇక నిన్న 2,256 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 86.63 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఎపి వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో తెలిపింది.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 109, చిత్తూరు 329, తూర్పుగోదావరి 188, గుంటూరు 364, కడప 84, కృష్ణా 277, కర్నూలు 24, నెల్లూరు 88, ప్రకాశం 83, శ్రీకాకుళం 117, విశాఖపట్నం 108, విజయనగరం 87, పశ్చిమ గోదావరి 379 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,589కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 796 మంది కరోనాతో మరణించారు.

Leave A Reply

Your email address will not be published.