తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి!

భారీగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు!

హైద‌రాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు జిల్లాల్లో జిల్లాలో అత్యల్పగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. తెలంగాణలో అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని గిన్నెధరి గ్రామంలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి టెంపరేచర్లు 6 డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయని వాతావరణ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. చలిగాలులతోపాటు పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు బయటకి రావడానికి జంకుతున్నారు. అటు ఉత్తర ఈశాన్యం నుంచే కాదు.. తూర్పు నుంచి కూడా తేమగాలులు స్టార్ట్‌ అవబోతున్నాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని గిన్నెధరి గ్రామంలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని భీంపూర్‌ మండలంలో 8 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లాలోని కుభీర్‌లో 8.9 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం కాస్లాబా‌ద్‌లో 9.4, మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం భాగ్యనగర్‌ నందనవనం ప్రాంతంలో 9.8 డిగ్రీలు, జిన్నారంలో 9.9డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా నవంబర్‌లో హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. బేగంపేట్‌లో 12.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. 1964 నవంబర్‌ 26న 7.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత ఇప్పటికీ రికార్డుగా ఉంది. దాని తర్వాత ఈ సీజన్ సిటిజన్లను భయపెడుతోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా చ‌లి తీవ్ర‌త రోజురోజుకూ పెరిగిపోతోంది. విశాఖ మన్యంలో చ‌లి తీవ్ర‌త అధికంగా అక్క‌డి జ‌నం చలికి గజగజ వణుకుకుతున్నారు. చింతపల్లిలో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.  ఇక డిసెంబర్, జనవరిలో ఉష్ణోగ్రతలు మరింత ప‌డిపోతాయ‌ని, చ‌లి తీవ్ర‌త తీవ్ర‌మ‌వుతుంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.