దేశంలో కొత్తగా 41,322 కరోనా కేసులు.. 485 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. చలికాలం ప్రవేశించడం, ప్రజలు కొవిడ్ -19 నిబంధనలు సరిగా పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా దేశంలో కొత్తగా 41,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,51,110కు చేరింది. ఇందులో 4,54,940 కేసులు యాక్టివ్గా ఉండగా, 87,59,969 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,36,200 మంది మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 485 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కొత్తగా 41,452 మంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారని తెలిపింది. నిన్నకంటే 4 శాతం కేసులు తక్కువగా నమోదయ్యాయని వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో గత 24 గంటల్లో 23 నుంచి 85 మంది బాధితులు చనిపోయారని పేర్కొంది. నిన్న మహారాష్ట్రలో 6,185 కొత్త కేసులు నమోదవగా, ఢిల్లీలో 5,482 మంది కరోనాబారినపడ్డారు. రాష్ట్రంలో 98 మంది చనిపోయారు.