పింఛన్‌దారులకు ఈపీఎఫ్ఓ శుభవార్త!

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుంది. అయితే పెన్షన్ పొందాలంటే పింఛన్‌దారులు నవంబరు లోపు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. తాము జీవించి ఉన్నట్లు చందాదారులు సర్టిఫికెట్‌ను సమర్పిస్తేనే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రతీ నెలా ఈపీఎఫ్ఓ పింఛన్‌ను మంజూరు చేస్తుంది.

అయితే కరోనావైరస్ నేపథ్యంలో అంతకుముందు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును నవంబరు 1 నుంచి 2020 డిసెంబరు 31 వరకు గడువును పెంచిన ప్రభుత్వం తాజాగా మరోసారి గడవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది (2021) ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ గడువును పెంచుతూ సెంట్రల్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో వయసు మీద పడిన ఫించన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లడం చాలా కష్టంగా మారింది. దీంతో పింఛన్‌దారులు గడువును మరికొంతకాలం పెంచాలంటూ పెన్షన్ మంత్రిత్వ శాఖకు వినతి పత్రాలను సమర్పించారు. వాటిని పరిగణలోకి తీసుకున్న మంత్రిత్వ శాక కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆఫిస్‌లో సంప్రదించిన అనంతరం గడువు తేదీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెన్షన్ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంతో ఫిబ్రవరి వరకు పింఛన్‌దారులకు యథావిధిగా పింఛన్ అందనుంది.

ముఖ్యాంశాలు.

  • పింఛన్​దారుల లైఫ్​ సర్టిఫికెట్​ను సమర్పించేందుకు ఇచ్చిన గడువును 2021 ఫిబ్రవరి 28కి పొడగించింది.
  • ఈ చర్యతో 35 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది.
  • పింఛన్‌దారుల జీవన ప్రమాణ పత్రం (లైఫ్‌ సర్టిఫికెట్‌) సమర్పణ తేదీని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పొడగించింది.
  • నవంబర్‌ 30 నుంచి 2021, ఫిబ్రవరి 28 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
  • ఈ నిర్ణయంతో కరోనా వైరస్‌ వల్ల దరఖాస్తు చేయలేకపోయిన 35 లక్షల మందికి పైగా పింఛన్‌దారులకు లబ్ధి చేకూరనుంది.
  • వీరందరికీ ఫిబ్రవరి వరకు ప్రతి నెలా ఫించను మంజూరు చేయనున్నారు.
  • ‘కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల పెద్ద వయస్కులు ఇబ్బందిపడే అవకాశం ఉంది. అందుకే ఈపీఎఫ్‌వో పింఛన్‌దారుల జీవన ప్రమాణ పత్రం సమర్పణ తేదీని నవంబర్‌ 28 నుంచి 2021, ఫిబ్రవరి 28 వరకు పొడగిస్తున్నాం’ అని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
  • ఈ చర్యతో 35 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది.
  • ప్రస్తుతం జీవన ప్రమాణ పత్రాన్ని నవంబర్‌ 30లోపు ఎప్పుడైనా సమర్పించొచ్చు.
  • దరఖాస్తు చేసిన తేదీ నుంచి ఏడాది వరకు ఇది వర్తిస్తుంది.
  • తాజాగా ఆ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడగించారు.
  • సాధారణ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులు, ఫించన్లు ఇచ్చే బ్యాంకు శాఖల్లో జీవన ప్రమాణ పత్రాలను సమర్పించొచ్చు.
Leave A Reply

Your email address will not be published.