మహారాష్ట్రలో కొత్తగా 6,112 కరోనా కేసులు
ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న అమరావతి జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 6,112 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,87,632కి చేరింది. అలాగే గత 24 గంటల్లో కొత్తగా 44 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో కొవిడ్ మరణాల సంఖ్య 51,713కు చేరింది. మరోవైపు కొత్తగా 2,159 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,89,963కు చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 51,713 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.