ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 197 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇవాళ కొత్తగా 197 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 234 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేర‌కు వైద్య ఆరోగ్య‌శాఖ హెల్త్‌బులిటెన్ విడుద‌ల చేసింది. ఇప్పటివరకు 8,85,234 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,75,690 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 2,411 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,133 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 40,986 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.