సెక్రటేరియట్ నిర్మాణ పనులు పరిశీలించిన కెసిఆర్

హైదరాబాద్: రూ.617 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయ సముదాయం నిర్మాణం అవుతున్న విషయం తెలిసిందే. కాగా కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, తలసానిశ్రీనివాస్ యాదవ్ కొప్పుల ఈశ్వర్, సిఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో కలిసి నిర్మాణ పనులను కెసిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను గురించి సిబ్బందిని అడిగి కెసిఆర్ వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ మెయిన్ గేట్తో పాటు ఇతర గేట్లు అమర్చే ప్రాంతాలు, భవన సముదాయం నిర్మించే ప్రాంతం, వాటి డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. pic.twitter.com/YmcIWcnPa1
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2021
ప్రధాన గేట్ తో పాటు, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. డిజైన్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీ కొప్పుల ఈశ్వర్, అధికారులు తదితరులున్నారు. pic.twitter.com/SgdUEvmvuY
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2021