తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు

హైదరాబాద్: గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. ఇక కరోనాతో ఒక్కరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 1,613 కి చేరింది. తాజాగా 163 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,95,988 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,92,578 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,797 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.