తెలంగాణలో కొత్తగా 99 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 99 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1618కి చేరింది. కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,673కి చేరింది. దీనిలో 2,93,379 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 1676 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.