భారత్ కొత్తగా 11,649 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్లో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా దేశంలో 11,649 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇండియాలో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,09,16,589 కు చేరింది. ఈ మేరకు సోమవారం ఉదయ కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కాగా ఇప్పటి వరకు దేశంలో 1.06 కోట్ల మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 1,39,637 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 90 మంది మృతి చెందారు. తాజా మృతులతో కలిపి దేశంలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 1,55,732 కు చేరిందని అధికారులు పేర్కొన్నారు.