టీఆర్ఎస్ నుంచి కుంట శ్రీనివాస్ సస్పెండ్
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథని మండల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తక్షణమే అమలవుతుందని టిఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్రెడ్డి తెలిపారు. న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో కుంట శ్రీనివాస్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.