కోటి మందికి వ్యాక్సిన్
న్యూఢిల్లీ: భారత్ కొవిడ్పై పోరులో మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటి మందికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 25 దేశాలకు భారత్ వ్యాక్సిన్లను సరఫరా చేయగా మరో 49 కన్సైన్మెంట్లను పూర్తిచేయనుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళాల కోసం రెండు లక్షల డోస్లను పంపుతామని భారత్ ఇప్పటికే ప్రకటించింది.