Corona: తెలంగాణలో 8126 కేసులు.. 38 మరణాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా సెకండ్వేవ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల (శనివారం రాత్రి 8 గంటల వరకు) వ్యవధిలో తెలంగాణలో కొత్తగా 8126 మంది కరోనా బారినపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు చేరింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 38 మంది వైరస్ వల్ల మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1999 మంది మరణించారు. తాజాగా 3307 మంది బాధితులు కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,30,304 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62,929 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.50 శాతంగా ఉండగా, రికవరీ రేటు 83.57 శాతంగా ఉన్నది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1259 కేసులు ఉండగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 676, రంగారెడ్డి జిల్లాలో 591, నిజామాబాద్లో 497, నల్లగొండలో 346, ఖమ్మలో 339, వరంగల్ అర్బన్లో 334, సిద్దిపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో 306, కరీంనగర్లో 286, జగిత్యాలలో 264, మంచిర్యాలలో 233, సంగారెడ్డిలో 201 చొప్పున నమోదయ్యాయి.