India Corona: దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి..
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 43,071 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,45,433కు పెరిగింది.
- తాజాగా 52,299 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 2,96,58,078 మంది కోలుకున్నారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కరోనా బారిన పడి 955 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 4,02,005 మంది రోగులు మృత్యువాతపడ్డారు.
- ప్రస్తుతం దేశంలో 4,85,350 యాక్టివ్ కేసులు ఉన్నాయి.