కర్ణాటక గవర్నర్ గా ధావర్ చంద్ ప్రమాణ స్వీకారం
బెంగళూరు(CLiC2NEWS): కర్ణాటక 19వ గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ అభయ్ శ్రీనివాస్ కొత్త గవర్నర్తో ప్రమాణ స్వీకారం చేయించారు.
గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కర్ణాటక సిఎం యడియూరప్ప, మంత్రులు, బెంగుళూరులో అందుబాటులో ఉన్న కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.