వాహనం లోయలో ప‌డి 8 మంది మృతి

నందర్బార్  (CLiC2NEWS): మ‌హారాష్ట్రలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. మ‌హారాష్ట్రలోని నందర్బార్ జిల్లాలో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో 8 మంది మ‌ర‌ణించారు.
స్థానికులు తెలిపిన వివరాల మేర‌కు… జిల్లాల్లోని తోరణ్​మాల్​ ఘాట్​లో ఒక ప్ర‌యివేటు వాహనం అదుపు తప్పి లోయలో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 8 మంది కూలీలు మరణించారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఈ వాహ‌నంలో 24 మంది ప్ర‌యాణిస్తున్నారు. ఘాట్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ర‌హ‌దారిపై వాహనం ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగినట్లు స‌మాచారం.

విష‌యం తెలిసిన వెంట‌నే స్థానికుల స‌హ‌కారంతో పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప‌లువురు క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక తోరణ్​మాల్​ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.