కాళేశ్వరంలో గోదావరి పుష్కరఘాట్లో భక్తుల సందడి
కాళేశ్వరం (CLiC2NEWS): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో తొలి ఏకాదశి సందర్భంగా గోదావరి స్తానానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ (మంగళవారం) ఉదయం నుంచే రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర తదితర ప్రాతాల నుంచి భారీగా విచ్చేశారు. కాళేశ్వరంలోని గోదావరి తీరం పుష్కరఘాట్ వద్ద భక్తులు స్నానాలు చేశారు. ఆలయం మూసి వేసి ఉండటంతో రాజగోపురం వద్ద నుంచే దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళ్లారు.