న్యూజీలాండ్లో మళ్లీ లాక్డౌన్: ఒకేఒక్క పాజిటివ్ కేసు నమోదు..

వెల్లింగ్టన్ (CLiC2NEWS): ఆరు నెలల తర్వాత న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దాంతో మంగళవారం నుంండి న్యూజిలాండ్లో కఠినంగా లాక్ డౌన్ చేయనున్నట్లు ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.
ఇప్పటికే న్యూజీలాండ్ కరోనాపై పోరాటం చేసి విజయం సాధించింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు కదిలారు ప్రధాని జెసిండా ఆర్డెర్న్. కాగా 6 నెలల తర్వాత స్థానికంగా తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఈ కేసును అధికారులు డెల్టా వేరియంట్గా అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ 3 రోజుల లాక్డౌన్ ప్రకటించారు.
50 లక్షలకు పైగా జనాభా ఉన్న న్యూజిలాండ్లో ఇప్పటి వరకు వందల్లో మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో కేవలం 26 మంది మాత్రమే కరోనాబారినపడి మరణించారు. కరోనాపై పూర్తిస్థాయిలో విజయం సాధించి ప్రపంచదేశాల అభినందనలు అందుకుంది న్యూజిలాండ్. ఈ సమయంలో 6 నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ ఒక కేసు నమోదవడంతో స్థానికంగా అక్కడి ప్రజలను కరోనా టెన్షన్ పెడుతోంది. దీంతో ప్రధానమంత్రి జెసిండా మూడు రోజులు లాక్డౌన్ విధించారు.
Wow, awesome weblog structure! How long have you been blogging for? you made running a blog glance easy. The overall look of your site is fantastic, let alone the content!!