India Covid: దేశంలో కొత్తగా 36,571 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉద‌యం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది.
  • ఇప్పటి వరకు దేశంలో 50.26 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 39,157 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 3,15,25,080 మంది బాధితులు కోలుకున్నారు
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 530 మంది మృత్యువాతపడ్డారు.
  • ప్రస్తుతం 3,63,605 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ చెప్పింది.
  • టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 57.22 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసింది.
Leave A Reply

Your email address will not be published.