గణేష్ నిమజ్జనానికి జలమండలి వాటర్ క్యాంపులు

నగరవ్యాప్తంగా 119 వాటర్ క్యాంపులు
భక్తుల కోసం 30.72 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం
అన్నదాన శిభిరాలకు ఉచిత వాటర్ ట్యాంకులు
వాటర్ క్యాంపులను పరిశీలించిన ఎండీ దానకిశోర్
హైదరాబాద్ (CLiC2NEWS): గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు తాగునీటిని అందించడంతో పాటు శోభయాత్ర సాఫీగా జరిగేందుకు జలమండలి తరపున కూడా తగు చర్యలు తీసుకుంటోందని జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. శనివారం ఆయన ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో భక్తుల కోసం జలమండలి ఏర్పాటు చేసిన వాటర్ క్యాంపులను పరిశీలించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ… గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల కోసం నగరవ్యాప్తంగా జలమండలి ఆధ్వర్యంలో 119 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేసి, 30.72 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. శోభయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో జలమండలి వాటర్ క్యాంపులు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటర్ప్యాకెట్లే కాకుండా అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో కూడా తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్నదాన శిభిరాలకు జలమండలి ఉచితంగా వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జలమండలి క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్(క్యూఏటీ)లు ఎప్పటికప్పుడు వాటర్ క్యాంపుల్లో మంచినీటి నాణ్యతను పరీక్షించడంతో పాటు క్లోరిన్ లెవల్స్ తగిన మోతాదులో ఉండేలా చూస్తాయని తెలిపారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి:
గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే అన్ని రూట్లలో జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎండీ దానకిశోర్ ఆదేశించారు. శోభయాత్రకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా వాటర్ లీకేజీలు, సివరేజీ ఓవర్ఫ్లోలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. శోభయాత్ర కొనసాగే ప్రాంతాల్లో మ్యాన్హోల్ మూతలు పరిశీలించి అవసరమైన చోట్ల మరమ్మత్తులు చేయించాలని ఆయన ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
Wow, incredible blog layout! How long have you ever been running a blog for? you make running a blog glance easy. The entire look of your site is great, as neatly as the content!!