శ్రీరాంసాగర్ 16గేట్ల ద్వారా నీటి విడుదల

నిజామాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాల్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు చేరడంతో అధికారులు 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
- ప్రస్తుతం జలాశయానికి 70వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది.
- ఔట్ ఫ్లో 49వేల క్యూసెక్కులు
- ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులు
- ప్రాజెక్టు గరిష్ఠ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు..
- ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉన్నదని అధికారులు తెలిపారు.