AP: రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు

విశాఖపట్టణం (CLiC2NEWS): రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
దక్షిణ తమిళనాడు తీర ప్రాంత పరిసరాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. అలాగే నైరుతి గాలులు కూడా బలంగా వీస్తున్నాయి. వాటి ప్రభావంతోనే ఎపిలో వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.