కాళేశ్వరంలో ఉధృతంగా గోదావరి..

కాళేశ్వరం (CLiC2NEWS): ఈ మధ్య కాలంలో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. భూపాలపల్లి జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువనుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 12 మీటర్లకు చేరింది.
దీంతో బుధవారం ఉదయం 2 గంటలకు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
పుష్కర ఘాట్వద్ద 12.57 మీటర్ల ఎత్తులో పారుతుండగా, 10.9 లక్షల క్యూసెక్కుల నీరు లక్ష్మి బరాజ్ వైపు ప్రవహిస్తున్నది.
అలాగే భద్రాచలం నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుండటంతో ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.