హుజూరాబాద్ పోరు: నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ!

హుజూరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈ ఉప ఎన్నిక కోసం ఈ అక్ట‌బరు 1వ తేదీన‌న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే.

  • అక్టోబ‌రు 11న నామినేషన్లను పరిశీలించనున్నారు.
  • అక్టోబ‌రు 13న నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
  • అక్టోబ‌రు 30న ఎన్నికలు జరగనున్నాయి.
  • నవంబర్ 2వ తేదీన‌ ఓట్లను లెక్కించనున్నారు.

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పటికే ఇక్క‌డ టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. బిజెపి తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా గా వెంకట్ బరిలో నిలిచారు.

Leave A Reply

Your email address will not be published.