ఒక్క రోజే 15 ల‌క్ష‌ల కొవిడ్ ప‌రీక్ష‌లు!

న్యూఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతోంది. మ‌రో వైపు భారీ స్థాయిలో కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 86,052 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 58 లక్షల 18 వేలు దాటింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,141 మంది మృతి చెందగా దేశ వ్యాప్తంగా 81,177 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,18,571గా ఉండగా.. యాక్టీవ్ కేసుల సంఖ్య 9,70,116గా ఉంది. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 47,56,164గా ఉండగా మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 92,290కు చేరింది. యాక్టివ్ కేసులు 16.67 శాతంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 14,92,409 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా…ఇప్పటి వరకు 6,89,28,440 టెస్టులు చేశారు. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 81 శాతం దాట‌గా, మ‌ర‌ణాల రేటు 1.59 శాతంగా ఉంది.

Leave A Reply

Your email address will not be published.