దేశంలో కొత్తగా 8,503 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవదిలో దేశంలో కొత్తగా 12,93,412 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 8,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో 3,46,74,744 కు చేరాయి.
- ఇప్పటి వరకు దేశంలో 3,41,05,066 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో కరోనాతో 4,74,735 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 7,678 మంది కరోనా నుంచి కోలకున్నారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 624 మంది కరోనాతో చనిపోయారు.
- కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది.