ఉద్యోగుల విభజనపై కలెక్టర్లకు ఆదేశాలు.. సిఎం కెసిఆర్
హైదరాబాద్(CLiC2NEWS) : ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల కలెక్టర్లు, సీనియర్ ఆధికారులతో సమావేశమయ్యారు. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన చేపట్టాలని సిఎం స్పష్టం చేశారు. ఈమేరకు నాలుగైదు రోజులలో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వెనుకబడిన మారుమూల జిల్లాల్లో పాలన అందరికీ చేరాలనే ఉద్దేశంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, ఉద్యోగులు మారుమూల గ్రామాల్లోకి వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సిఎం స్పష్టం చేశారు.
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే (స్పౌస్కేస్) వారు ఒకేచోట పనిచేసే విధంగా అవకాశం కల్పించాలని ఆదేశించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలకు ఇబ్బంది లేకుండా స్పౌస్కేస్లకు సంబంధించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.