AP: 12వేల‌కు పైగా కొత్త‌కేసులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కారోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 47,420 మందికి కొవిడ్ నిర్థార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. కొత్త‌గా 12,615 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్క‌రోజులో ఐదుగురు ఈ మ‌హ‌మ్మారికి బ‌లైనారు. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఈవైర‌స్ నుండి 3,674 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 53,871 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు వైద్యారోగ్య శాఖ బుటిటెన్ విడుద‌ల‌చేసింది.

Leave A Reply

Your email address will not be published.