భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్లో భారత్ ఆధిక్యత..
భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆట ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (96), హనుమ విహారి (58), మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ(29 ) పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ (45) విహారితో కలిసి 90 పరుగులు జోడించాడు. కోహ్లీకి ఇది వందో టెస్టు మ్యాచ్ కావడంతో సెంచరీ చేయడం ఖాయమని అభిమానులు భావించారు. ఎంబుల్దెనియా వేసిన బాల్కి కోహ్లీ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.