ప్రధానితో ముగిసిన జగన్ భేటీ

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జగన్ భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న జగన్, మంగళవారం ఉదయం 11గంటలకు మోడీని కలిశారు. ఇటీవలకాలంలో రెండుసార్లు ప్రధానిని కలవడం చర్చనీయాంశంగా మారింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశం రాష్ట్ర అభివృద్ధి అజెండాగా సాగినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు సమాచారం.
ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.