ఇల్లు అంటే మ‌హిళ‌ల‌కు శాశ్వ‌త చిరునామా.. సిఎం జ‌గ‌న్‌

అంద‌రికీ ఇల్లు ఇవ్వాల‌న్న‌దే నా ల‌క్ష్యం

విశాఖ ప‌ట్నం(CLiC2NEWS): దేవుడి ద‌య‌తో ఈ రోజు ఓమంచి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్నామ‌ని ఎపి సిఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అన్నారు. విశాఖ, అన‌కాప‌ల్లి జిల్లాల్లో సిఎం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంలో సిఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. అంద‌రికీ ఇళ్లు ఇవ్వాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు.  1.23 ల‌క్ష‌ల మందికి ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేస్తున్నామ‌ని, ఇప్ప‌టివ‌ర‌కు మెత్తం 30 ల‌క్ష‌ల 70 వేల మందికి స్థ‌లాలు ఇచ్చామ‌ని చెప్పారు. ఇల్లు రాని వారు స‌చివాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని సిఎం అన్నారు. ఇక ఇల్లు ఉంటే మ‌హిల‌ల‌కు శాశ్వ‌త చిరునామా ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని, 16 నెల‌ల క్రిత‌మే ఈ కార్య‌క్ర‌మం జర‌గాల్సింద‌ని తెలిపారు. పేద‌ల‌కు సొంతిల్లు క‌ల్పించ‌డంలో కులం, మ‌తం, ప్రాంతం చూడ‌లేద‌ని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మ‌హిళ‌ల‌కు మంచి చేయ‌డంలో తాను రాజీ ప‌డ‌న‌ని జ‌గ‌న్‌ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.