పాశ‌మైలారం పారిశ్రామిక వాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం

సంగారెడ్డి (CLiC2NEWS): ప‌టాన్‌చెరు ప‌రిధిలోని పాశ‌మైలారం పారిశ్రామిక వాడ‌లో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. పారిశ్రామిక వాడ‌లోని పెంయింట్, ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌ల్లో శనివారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో అక‌స్మాత్తుగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ముందుగా పెయింట్ ప‌రిశ్ర‌మ‌లో మంట‌లు వ‌చ్చాయి. వాటినిఅదుపులోకి తీసుకురాలేక పోవ‌డంతో ప‌క్క‌నే ఉన్న ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో మంట‌లు వ్యాపించాయి. దీంతో ర‌సాయ‌నాల‌తో కూడిన డ్ర‌మ్ముల‌కు మంట‌లు అంటుకున్నాయి. ప‌రిశ్ర‌మ‌లోని యంత్రాలుకూడా అగ్నికి ఆహుత‌య్యాయి. మంట‌ల‌ను అదుపులోకి తేవ‌డానికి అగ్నిమాప‌క సిబ్బంది ప్ర‌య‌త్నాలుచేస్తున్నారు. భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించ‌డం వ‌ల‌న ద‌ట్ట‌మైన పొగ అలుముకోవ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌కు గురౌతున్నారు.

Leave A Reply

Your email address will not be published.