అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం ప‌ట్టివేత‌

మంచిర్యాల (CLiC2NEWS): జిల్లాలో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న పిడియ‌స్ బియ్యంను క‌న్నెప‌ల్లి పోలీసులు ప‌ట్టుకున్నారు. కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకట పూర్ గ్రామం చుట్టూ పక్కల నుండి పీడీఎస్ రైస్ సేకరించి కాగజనగర్ కి అక్రమంగా ఆటోల ద్వారా తరలిస్తున్నారన్న ప‌క్కా సమాచారం మేరకు ఎస్ఐ సురేష్ సిబ్బందితో కలిసి త‌నిఖీలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్జా పూర్ ఆటో స్టాండ్ వద్ద అక్రమముగా తరలిస్తున్న సుమారు 8 క్వింటాళ్ళ పీడీఎస్ రైస్‌ ప‌ట్టుకున్నారు. మంచిర్యాల ప‌ట్ట‌ణంలోని ఎన్‌టిఆర్ న‌గ‌ర్‌కు చెందిన చింత‌ల ర‌మేష్ వ‌ద్ద‌ సుమారు రూ.9 వేలు విలువ చేసే 8 క్వింటాళ్ల బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఆటోతో పాటు  నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.