Peddapalli: నేరాల నివారణలో ప్రజల బాగస్వామ్యం ముఖ్యం..

సిసిటివి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి

పెద్ద‌పల్లి (CLiC2NEWS): జిల్లా కేంద్రంలో ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో భాగంగా పోలీసుల‌కు త‌మ‌వంతు సాయంగా రెండ‌వ వార్డు కౌన్సిల‌ర్ పాస్తం హనుమంతు 8 సిసి కెమెరాలు అంద‌జేశారు. ఈ సందర్బంగా సిఐ ప్ర‌దీప్‌కుమార్‌  మాట్లాడుతూ.. నేరాల నివారణలో సిసిటివి కెమెరాలు ప్రముఖ పాత్ర పోసిస్తున్నాయని అన్నారు. కెమెరాలు ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో నేరాలు చేయడానికి నేరగాళ్లు వెనకాడుతార‌ని, పట్టణంలో దొంగతనాలు, ఈవ్ టీసింగ్, నేరాలు జరగకుండా నిరోదించవచ్చు అన్నారు. వార్డులు, కాలనీలు, అపార్ట్మెంట్స్, వ్యాపార ప్రాంగణాలు, షాప్స్ వద్ద కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని సిఐ కోరారు .

 

Leave A Reply

Your email address will not be published.